Posts

స్వచ్ఛ వీరన్నపాలెం

Image
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనేది అక్షర సత్యం. వనం లేకపోతే మనం లేము. భూతాపాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడటానికి వృక్షాలు ఇతోధికంగా సహాయపడతాయి. అడ్డం వచ్చిందనో ,ఆదాయం రావటంలేదనో అడ్డదిడ్డంగా చెట్లను తొలిగించే అలవాటు వల్ల నేడు సమాజానికి అనేక ఇక్కట్లు వాటిల్లుతున్నాయి. వర్షాలు తగ్గాయి. ఎండలు మండుతున్నాయి. వాయు కాలుష్యం పెరిగింది. ఆరోగ్యానికి ఆపద పొంచియుంది. ఈ సమస్యలన్నింటికీ ఒక్కటే నివారణోపాయం. అదే నీడను ఇచ్చే చెట్లను విరివిగా పెంచటం,వాటిని సంరక్షించుకోవటం. సామాజిక సృహతో ప్రతి వ్యక్తి దీనికి తోడ్పాటు అందించాలి. స్వచ్ఛ వీరన్నపాలెం కార్యక్రమం లో భాగంగా పచ్చదనం కొరకు వీరన్నపాలెం గ్రామంలో చెట్లను పెంచే కార్యక్రమాన్నికొమల ట్రస్ట్ చేపట్టింది. పర్యావరణం ,పారిశుద్ధ్యం పరిరక్షించుదాం మన ఊరు పరిశుభ్రతే మన ఆరోగ్య రక్షణా సూత్రం స్వచ్ఛందంగా సేవ చేద్దాం రండి 12 సెప్టెంబర్ 2021 ఆదివారం , ఉదయం 7గం. లకు కొత్త చెరువు వద్ద మొక్కలు సంరక్షించే కార్యక్రమం. కన్వీనర్ - శ్రీమతి కొల్లా రత్నకుమారి

రిపబ్లిక్ దినోత్సవం - విద్యార్థులకి ప్రోత్సాహక బహుమతులు

Image
ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగష్టు 15న కీర్తిశేషులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి (1926-2017)  జ్ఞాపకార్థం వారి అర్ధాంగి శ్రీమతి అలివేలు మంగమ్మ, కుమారుడు రాఘవేంద్రరావు గార్ల సహకారంతో కొమల చారిటబుల్ ట్రస్ట్ వారిచే వీరన్నపాలెం గ్రామంలో ఉన్న శ్రీ నవ్యభారత విద్యాలయాలలో చదివే ప్రాధమిక మరియు ఉన్నత పాఠశాలల విద్యార్థులకి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వటం జరుగుతుంది. కీర్తిశేషులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ప్రారంభించిన ఈ బహుమతి కార్యక్రమం వారి మరణానంతరం కుటుంబ సభ్యుల సహకారంతో కొమల ట్రస్ట్ వారు చేపట్టి దానిని కొనసాగిస్తున్నది. కరోనా కారణంగా స్వాతంత్ర దినోత్సవం నాటి కార్యక్రమం వాయదా పడినందువల్ల దానిని రిపబ్లిక్ దినోత్సవం 26 జనవరి,2021న, జరిపారు. ముందుగా జండా వందనం చేసి ఆతరువాత సభను జరిపి, చదువులలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రత్యేక బహుమతులతో పాటు పాఠశాలలో చదువుతున్న విద్యర్దులు అందరికి జామంట్రీ బాక్స్ తో పాటు వివిధ రకాల పుస్తకాలను బహుమతులుగా అందించబడ్డాయి. వీటితోపాటు ప్రతి తరగతిలో ప్రధమ, ద్వితీయ,తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులకు శ్రీ పునుగుపాటి వెంకటేశ్వర రావు గారి కుమార్త సంధ్యారాణి కుటుంబ

కొడాలి వారి వంశ వృక్షం

Image
కొడాలి మల్లిఖార్జునరావు గారి వంశ వృక్షం   గోత్రం : శిఖినూళ్ల   కుటుంభ మూల పురుషుడు: సుందర రామయ్య   ( వీరి పూర్వీకుల వివరాలు అందుబాటులో లేవు )   స్థిర నివాసం: మోపర్రు (అమృతలూరు మండలం,గుంటూరు జిల్లా) A. సుందర రామయ్య కుమారులు  1. వెంకయ్య (సంతానం లేదు)     2. లక్ష్మయ్య (భార్య రత్తమ్మ) B. లక్ష్మయ్య,రత్తమ్మ గార్ల  కుమారులు   1. వెంకటప్పయ్య  (వెంకయ్య దత్త పుత్రుడు) 2.   సుందర రామయ్య (సంతానం లేదు) C.వెంకటప్పయ్య, రామానుజమ్మల సంతానం  1. వెంకట్రామయ్య (భార్య లక్ష్మీ నరసమ్మ- పాలడుగు వెంకట కృష్ణయ్య, వర లక్ష్మమ్మ గారి ప్రధమ కుమార్తె,పెద రావూరు) 2. లక్ష్మీ నారాయణ (భార్య నాగరత్తమ్మ) 3. పల్లెంపాటి నరసమ్మ (కుమార్త) D. వెంకట్రామయ్య, లక్ష్మీ నరసమ్మ ల  సంతానం   1. గోపాల కృష్ణయ్య (భార్య పద్మావతి) 2. మల్లిఖార్జున రావు (భార్య గోరంట్ల లక్ష్మీ దేవమ్మ) 3. ధనమ్మ (భర్త గోగినేని దేవయ్య) 4. రంగారావు ( భార్య ఉమాదేవి.ధనమ్మ కుమార్త) E. మల్లికార్జున రావు, లక్ష్మీ దేవమ్మల సంతానం స్థిర నివాసం: వీరన్నపాలెం (పర్చూరు మండలం, ప్రకాశం జిల్లా)   1. రమేష్ బాబు (భార్య పొట్రు సుజాత, సంతానం వినయ్ కుమార్, హిమజా రాణి) 2. లతా మంజరి (భర్

కోవిడ్ -19 పై అవగహన సదస్సు

Image
కొమల చారిటబుల్ ట్రస్ట్ వారు ది. 16- 09- 2020 న ప్రకాశం జిల్లా పర్చూరు మండలం వీరన్నపాలెం గ్రామం లో కరోనా వ్యాధి నియంత్రణ జాగ్రత్తల గురించి గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా గ్రామ వాలంటీర్లకు, గ్రామ సచివాలయ సిబ్బందికి, పారిశుద్ద కార్మికులకు, హరిత హారం లో పనిచేసే కూలీలకు శ్రీ సోమేపల్లి శ్రీనివాస్, శ్రీదేవి దంపతులు అందించిన మాస్కులు మరియు శానిటైజర్లు ను కొమల ట్రస్ట్ సభ్యురాలు శ్రీమతి కొల్లా రత్న కుమారి గారు పంపిణి చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి కరోనా గురించిన అవగాహన కల్పించారు. రోజురోజుకి గ్రామీణ ప్రాంతాలలో తీవ్ర రూపు దాల్చుతున్న ఈ కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే ప్రతివారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, సురక్షితమైన దూరాన్ని వ్యక్తులమధ్య పాటించాలని, తరుచు చేతులు శుభ్రం చేసుకోవాలని, ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ పోష్టికాహారం తీసుకొని వ్యాధి నిరోధక శక్తిని పెపొందించుకోవాలని రత్న కుమారి అందరిని కోరారు. ప్రజలలో నిర్లక్ష్యం వల్లే ఈ కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతుందని, అప్రమత్తం గా ఉంటే దాన్ని అరికట్టవచ్చు అని కొమల ట్రస్ట్ వీరన్నపాలెం కన్వీనర్ శ్రీ గోరంట్ల రాఘవేం

మానవతావాది డాక్టర్ కొడాలి రంగారావు

Image
ప్రజా వైద్యుడు .సత్తెనపల్లి పరిసర ప్రజలకు దాదాపు నాలుగు దశాబ్దాలు విశేష వైద్య సేవలు అందించిన మానవతావాది ఆదర్శమూర్తి డాక్టర్ కొడాలి రంగారావు. డాక్టర్ రంగారావు గారు గుంటూరు జిల్లా అమృతలూరు మండలం మోపర్రు గ్రామంలో కొడాలి వెంకట్రామయ్య, లక్ష్మి నరసమ్మ దంపతులకు 1938 ఏప్రిల్ 22న జన్మించారు. వీరికి గోపాల కృష్ణయ్య, మల్లిఖార్జున రావు అనే ఇద్దరు అన్నలు,ధన లక్ష్మీ అనే అక్కయ్య ఉన్నారు. రంగారావు గారి హైస్కూల్ విద్య తురిమెళ్ళ లోను,PUC గుంటూరు హిందూ కాలేజీ లోను, వైద్య విద్య MBBS ను మణిపాల్ కే.ఎం.సి కళాశాల లో చదివారు. 1961 లో తన సోదరి గోగినేని ధనలక్ష్మి,దేవయ్య గార్ల కుమార్తె ఉమాదేవిని వివాహం చేసుకున్నారు. వామ పక్ష భావాలు గల రంగారావు గారు రోగుల పట్ల చాలా ఉదారంగా ఉండేవారు. తొలుత తెనాలిలో డాక్టర్ కుర్రా వీరరాఘవయ్య, డాక్టర్ కొడాలి వీరయ్య చౌదరి గార్ల వద్ద కొద్ది కాలం వైద్యునిగా పనిచేసి నైపుణ్యం గడించారు. ఆ తరువాత   వైద్య సదుపాయాలు ఏమాత్రం లేని గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి అనే గ్రామీణ ప్రాతంలో 1962 లో తొలి ప్రజా వైద్య శాల "నాగార్జున నర్సింగ్ హోమ్" ను స్థాపించి వెనకబడిన పలనాటి గ్రామీణ

హరిత హారం

Image
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనేది అక్షర సత్యం. వనం లేకపోతే మనం లేము. భూతాపాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడటానికి వృక్షాలు ఇతోధికంగా సహాయపడతాయి. అడ్డం వచ్చిందనో ,ఆదాయం రావటంలేదనో అడ్డదిడ్డంగా చెట్లను తొలిగించే అలవాటు వల్ల నేడు సమాజానికి అనేక ఇక్కట్లు వాటిల్లుతున్నాయి. వర్షాలు తగ్గాయి. ఎండలు మండుతున్నాయి. వాయు కాలుష్యం పెరిగింది. ఆరోగ్యానికి ఆపద పొంచియుంది. ఈ సమస్యలన్నింటికీ ఒక్కటే నివారణోపాయం. అదే నీడను ఇచ్చే చెట్లను విరివిగా పెంచటం,వాటిని సంరక్షించుకోవటం. సామాజిక సృహతో ప్రతి వ్యక్తి దీనికి తోడ్పాటు అందించాలి. స్వచ్ఛ వీరన్నపాలెం కార్యక్రమం లో భాగంగా పచ్చదనం కొరకు వీరన్నపాలెం గ్రామంలో చెట్లను పెంచే కార్యక్రమాన్నికొమల ట్రస్ట్  చేపట్టింది. దీనిలో భాగంగా ఆత్మీయుల  పుట్టిన రోజు / జయంతి, వర్థంతి,పెళ్లి రోజు వంటి విశిష్ట శుభ దినాలలో వారి పేరుతో  ఒక చెట్టును నాటి దానిని   పెంచి పోషించటానికి  దాతల నుండి ట్రస్టు విరాళం సేకరించి వారిని హరిత హారం   కార్యక్రమంలో  భాగస్వాములుగా చేసే ఒక బృహత్తర పనికి కొమల ట్రస్ట్ 26-06- 2020న నాంది పలికింది.  కొమల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ కొడాలి శ్ర

COVID-19, PM CARES Fund

Image
Keeping in mind the need for having a dedicated national fund with the primary objective of dealing with any kind of emergency or distress situation, like posed by the COVID-19 pandemic, and to provide relief to the affected, a public charitable trust under the name of ‘Prime Minister’s Citizen Assistance and Relief in Emergency Situations Fund’ (PM CARES Fund)’ has been set up. The fund consists entirely of voluntary contributions from individuals/organizations and does not get any budgetary support. The fund will be utilised in meeting the objectives as stated above. Donations to PM CARES Fund would qualify for 80G benefits for 100% exemption under the Income Tax Act, 1961. Donations to PM CARES Fund will also qualify to be counted as Corporate Social Responsibility (CSR) expenditure under the Companies Act, 2013