రిపబ్లిక్ దినోత్సవం - విద్యార్థులకి ప్రోత్సాహక బహుమతులు

ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగష్టు 15న కీర్తిశేషులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి(1926-2017) జ్ఞాపకార్థం వారి అర్ధాంగి శ్రీమతి అలివేలు మంగమ్మ, కుమారుడు రాఘవేంద్రరావు గార్ల సహకారంతో కొమల చారిటబుల్ ట్రస్ట్ వారిచే వీరన్నపాలెం గ్రామంలో ఉన్న శ్రీ నవ్యభారత విద్యాలయాలలో చదివే ప్రాధమిక మరియు ఉన్నత పాఠశాలల విద్యార్థులకి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వటం జరుగుతుంది. కీర్తిశేషులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ప్రారంభించిన ఈ బహుమతి కార్యక్రమం వారి మరణానంతరం కుటుంబ సభ్యుల సహకారంతో కొమల ట్రస్ట్ వారు చేపట్టి దానిని కొనసాగిస్తున్నది.

కరోనా కారణంగా స్వాతంత్ర దినోత్సవం నాటి కార్యక్రమం వాయదా పడినందువల్ల దానిని రిపబ్లిక్ దినోత్సవం 26 జనవరి,2021న, జరిపారు. ముందుగా జండా వందనం చేసి ఆతరువాత సభను జరిపి, చదువులలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రత్యేక బహుమతులతో పాటు పాఠశాలలో చదువుతున్న విద్యర్దులు అందరికి జామంట్రీ బాక్స్ తో పాటు వివిధ రకాల పుస్తకాలను బహుమతులుగా అందించబడ్డాయి.



వీటితోపాటు ప్రతి తరగతిలో ప్రధమ, ద్వితీయ,తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులకు శ్రీ పునుగుపాటి వెంకటేశ్వర రావు గారి కుమార్త సంధ్యారాణి కుటుంబ సభ్యులు, వారి తాత, నాయనమ్మలు కీ. శే. సుబ్బయ్య, లక్షమ్మ ల జ్ఞాపకార్థం బహుమతులు ఇచ్చారు. వీరికి శ్రీ చిన్నం సుబ్బారావు గారు కూడా వార్షిక బహుమతులు అందజేసారు.
ఈ కార్యక్రమంలో శ్రీ నవ్య భారత విద్యాలయాల పాలక వర్గ అధ్యక్షులు శ్రీ చిట్టినేని సురేష్ బాబు, నిర్వాహక కార్యదర్శి శ్రీ గోరంట్ల శేషగిరిరావు, పాలక వర్గ సభ్యులు శ్రీ గోరంట్ల రాఘవేంద్రరావు, శ్రీ చిన్నం సుబ్బారావు, ముఖ్య అతిధులుగా కొమల చారిటబల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కొడాలి శ్రీనివాస్, పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని శ్రీ నవ్య భారత ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ గొట్టుముక్కల వీరయ్య చౌదరి గారు, శ్రీ నవ్యభారత గోరంట్ల బుచ్చిపాపయ్య ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు గారు నిర్వహించారు.

Comments

Popular posts from this blog

ధన్యజీవి కీర్తి శేషులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి

కీ. శే. కొడాలి మల్లిఖార్జునరావు గారి చతుర్ధ వర్ధంతి

కొడాలి వారి వంశ వృక్షం