కోమల చారిటబుల్ ట్రస్ట్ వారి నిర్వహణలో దంత వైద్య శిబిరం


కోమల చారిటబుల్ ట్రస్ట్ వారి నిర్వహణలో ప్రకాశం జిల్లా పర్చూరు మండలం,  వీరన్నపాలెం గ్రామంలో ది. 15- 10 -2016 న శ్రీ నవ్యభారత్ పాఠశాల ఆవరణలో ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు చేయబడినది. ముందుగా జరిగిన ట్రస్ట్ ఆవిర్భావ సదస్సును   సిబార్ దంత వైద్య కళాశాల చైర్మన్ డాక్టర్ లింగమనేని సుబ్బారావు గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తల్లిదండ్రుల పేరుతో ట్రస్టును ఏర్పాటు చేసి సమాజ సేవకు కంకణం కట్టుకున్న కోమల ట్రస్ట్ వ్యవస్థాపక ఛైర్మెన్ కొడాలి శ్రీనివాస్ ను అభినందించారు.  శ్రీనివాస్ అధ్యక్షత వహించిన ఈ సదస్సులో సిబార్ దంత కళాశాల వైద్యులు   డాక్టర్ మువ్వా సురేష్ బాబు, డా. మువ్వా శ్రీదేవి, డా. అప్పయ్య చౌదరి, గ్రామ సర్పంచ్ మక్కెన శేఖర్ బాబు, కొడాలి వినయ్ కుమార్, పైమరి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కన్నెగంటి కుమారస్వామి, హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు టి.శ్రీనివాస్, ట్రస్ట్ కార్యదర్శి గోరంట్ల రాఘవేంద్రరావు పాల్గొన్నారు. డా. రావూరి శ్రీనివాస్ గారు దంత సంరక్షణకు తీసుకోవాలిసిన ముందు జాగ్రత్తలను గురించి వ్యాధుల గురించి అవగాహన కల్గించారు. ఈ కార్యక్రమంలో రోగులకు మందులను ట్రస్ట్ వారు ఉచితంగా పంపిణి చేశారు. పాఠశాల విద్యార్థులకు టూత్ పేస్టులూ, బ్రష్ లూ, బిస్కెట్ ప్యాకెట్ లు పంచారు. ఈ దంత వైద్య శిబిరానికి ప్రజలనుండి విశేష స్పందన లభించింది. 






Comments

Popular posts from this blog

ధన్యజీవి కీర్తి శేషులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి

వీరన్న పాలెం గ్రామ చరిత్ర - 2

కీ. శే. కొడాలి మల్లిఖార్జునరావు గారి చతుర్ధ వర్ధంతి