Posts

Showing posts from February, 2019

ప్లాస్టిక్ రహిత సమాజం - మై ప్లాస్టిక్

Image
వీరన్న పాలెం గ్రామం లో ది.10-2-2019 న "ప్లాస్టిక్ రహిత సమాజం - మై ప్లాస్టిక్ " అనే అంశం పై అవగాహన సదస్సు జరింగింది. ఈ అవగాహన  సదస్సును చిలక లూరి పేట వాసవీ క్లబ్ వారు కొమల చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో నిర్వహించారు. వాసవి క్లబ్ అధ్యక్షులు,మై ప్లాస్టిక్ కార్యక్రమ నిర్వాహకులు  శ్రీ కె . ప్రసాద్ గారు  సమాజం పై చూపుతున్న ప్రభావాన్ని చక్కగా గ్రామస్తులకు   వివరించారు.  ఇంటిలో రోజువారీ వాడకంలో వచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలను ఒక సంచిలో వేసి వారానికి ఒక రోజు వాటిని గ్రామం లో నిర్దేశించిన ప్రదేశంలో వేసిన వాటిని అక్కడినుండి తాము తరలించి వాటిని రీసైక్లింగ్ చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కొమల ట్రస్ట్ చైర్మన్ కొడాలిశ్రీనివాస్ ప్రసంగిస్తూ ఇంటిలో వచ్చే వ్యర్థాలతో రెండు రకాలని , కుళ్లిపోయి భూమిలో కలిసే పోయే వ్యర్థాలను ఎరువులుగా వాడి భూమిని సారవంతం చేసుకోవచ్చని వాటికొరకు పంచాయితీ వారి సహకారం తో డంప్ యార్డును నిర్వహించుకోవాలని దానికి తగిన సహాయ సహకారాలను తమ ట్రస్టు ద్వారా అందజేయగమని తెలిపారు. గ్రామ పరిశుభ్రత కొరకు అందరికి అవగాహన కలిగించటానికి విద్యార్థుల సహకారంఓతో గ్రామంలో ప్రతి ఇంటికి ఒక కరపత

సేవా సదనం కు శంకు స్థాపన

Image
కొడాలి మల్లిఖార్జునరావు లక్ష్మి దేవమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా పర్చూరు మండలం వీరన్నపాలెం గ్రామంలో 1.5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ బడుతున్న  సేవా సదనం  కు 9-02-2019 న ఉదయం 8. 52 ని లకు (శనివారం)  శంకు స్థాపన పక్రియ అత్యంత వైభవంగా జరిగింది. ట్రస్ట్ వ్యవస్థాపకులు కొడాలి శ్రీనివాస్ రాఘిని దంపతులు చేతులు మీదుగా శాస్త్రీయంగా భూమిపూజ,శంకుస్థాపన ప్రదమేష్ఠికావిన్యాసం, నవగ్రహ వాస్తు శాంతి యాగం చేశారు. ఈ కార్యక్రమం లో ట్రస్టు సభ్యులు గోరంట్ల రాఘవేంద్రరావు , లతా మంజరి , కొడాలి వినయ్ కుమార్ తో పాటు పర్చూరు మార్కెట్ యార్డ్ అధ్యక్షులు చిట్టినేని రామకృష్ణ, గ్రామ సర్పంచ్ శేఖర్ బాబు తో పాటు అనేక మంది గ్రామ పెద్దలు, మిత్రులు పాల్గొని కార్యకమాన్ని విజయవంతం చేశారు. 

కొమల సేవాసదనాన్ని సందర్శించిన శాసన సభ సభ్యులు శ్రీ ఏలూరి

Image
పర్చూరు శాసన సభ సభ్యులు శ్రీ ఏలూరి సాంబ శివ రావు గారు పిబ్రవరి 3 ,2019 న వీరన్నపాలెం లో కొమల ట్రస్ట్ వారు నిర్మంచే 'సేవా సదనం' ప్రదేశాన్ని సందర్శించారు.  కొమలట్రస్ట్ చేపట్టిన కార్యక్రమాలను తెలుసుకొని వాటికి కావలిసిన సహకారం అందించగలనని తెలిపారు. ది 9-02-2018 న సేవాసదనం శంఖుస్థాపన కార్యక్రంలో పాల్గొన గలనని తెలిపారు. ఈ ఆత్మీయ సమావేశంలో ట్రస్టు సభ్యులు కొడాలి శ్రీనివాస్, శ్రీమతి రాఘిని, గోరంట్ల రాఘవేంద్రరావు,శ్రీమతి లతామంజరి, శ్రీమతి కొడాలి సుజాత  లతో పాటు గ్రామ సర్పంచ్ మక్కెన శేఖర్ ,మార్కెట్ యార్డ్ చైర్మన్ చిట్టినేని రామకృష్ణ, శ్రీమతి కొల్లా రత్న కుమారి తో పాటు అనేక మంది పాల్గొన్న వారిలో ఉన్నారు.