సేవా సదనం కు శంకు స్థాపన
కొడాలి మల్లిఖార్జునరావు లక్ష్మి దేవమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా పర్చూరు మండలం వీరన్నపాలెం గ్రామంలో 1.5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ బడుతున్న సేవా సదనం కు 9-02-2019 న ఉదయం 8. 52 ని లకు (శనివారం) శంకు స్థాపన పక్రియ అత్యంత వైభవంగా జరిగింది. ట్రస్ట్ వ్యవస్థాపకులు కొడాలి శ్రీనివాస్ రాఘిని దంపతులు చేతులు మీదుగా శాస్త్రీయంగా భూమిపూజ,శంకుస్థాపన ప్రదమేష్ఠికావిన్యాసం, నవగ్రహ వాస్తు శాంతి యాగం చేశారు. ఈ కార్యక్రమం లో ట్రస్టు సభ్యులు గోరంట్ల రాఘవేంద్రరావు , లతా మంజరి , కొడాలి వినయ్ కుమార్ తో పాటు పర్చూరు మార్కెట్ యార్డ్ అధ్యక్షులు చిట్టినేని రామకృష్ణ, గ్రామ సర్పంచ్ శేఖర్ బాబు తో పాటు అనేక మంది గ్రామ పెద్దలు, మిత్రులు పాల్గొని కార్యకమాన్ని విజయవంతం చేశారు.
Comments
Post a Comment