వీరన్న పాలెం గ్రామం లో కల్యాణ మండపం / సేవా సదనం


ప్రకాశం జిల్లా పర్చూరు మండలం ,వీరన్న పాలెం  గ్రామం లో కొమల ట్రస్ట్ వారు తమ సేవా కార్యక్రమాలలో భాగంగా " సేవా సదనం " (కమ్యూనిటీ హాల్ / కల్యాణ మండపం ) నిర్మించుటకు పర్చూరు-బాపట్ల రోడ్ (చెరువు ఒడ్డున) సెప్టెంబర్ 28, 2018 న షుమారు 25 సెంట్లు స్థలాన్ని శ్రీమతి  సోమేపల్లి సీతారావమ్మ, వారి కుమారుడు శ్రీనివాసరావు గార్ల నుండి  సేకరించిందని సంతోషంగా తెలియజేస్తున్నాం. 
త్వరలో ఒక శుభసమయాన భూమి పూజ చేసుకొని వీరన్న పాలెం గ్రామ వాసుల చిరకాలస్వప్నమైన,సామాజిక భవనం (కల్యాణ మండపం)  ఒక రూపుదిద్దుకుంటుంది. ఈ బృహత్తర కార్యంలో మీ సలహాలు సూచనలు ట్రస్ట్ వారికి అందజేయగలరు.  
సేవా సదనం  ఒక రూపు దాల్చే కార్యక్రమంలో ప్రత్యేక్షముగా కానీ , పరోక్షంగా కానీ సహకారం అందించే వారు దీన్ని మిత్రులందరికీ షేర్ చేయండి. చినుకు చినుకు కలిస్తే నది అవుతుంది. చేయి చేయి కలిపి కలసి కదిలితే సమాజం బాగుంటుంది. రండి మన  జన్మ భూమి వీరన్నపాలెం రుణం తీర్చుకుందాం.   

Comments

Popular posts from this blog

ధన్యజీవి కీర్తి శేషులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి

కీ. శే. కొడాలి మల్లిఖార్జునరావు గారి చతుర్ధ వర్ధంతి

కొడాలి వారి వంశ వృక్షం