విద్యార్థులకి ప్రోత్సాహక బహుమతులు

ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగష్టు 15న కీర్తిశేషులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి జ్ఞాపకార్థం (1926-2017) వారి అర్ధాంగి శ్రీమతి అలివేలు మంగమ్మ, కుమారుడు రాఘవేంద్రరావు గార్ల సహకారంతో కొమల చారిటబుల్ ట్రస్ట్ వారిచే వీరన్నపాలెం గ్రామంలో ఉన్న శ్రీ నవ్యభారత విద్యాలయాలలో చదివే ప్రాధమిక మరియు ఉన్నత పాఠశాలల విద్యార్థులకి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వటం జరుగుతుంది. కీర్తిశేషులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ప్రారంభించిన ఈ బహుమతి కార్యక్రమం వారి మరణానంతరం కుటుంబ సభ్యుల సహకారంతో కొమల ట్రస్ట్ వారు చేపట్టి దానిని కొనసాగిస్తున్నది. దీనిలో భాగంగా భారతదేశ స్వాతంత్ర దినోత్సవం ఆగష్టు 15, 2019 న చదువులలో ప్రతిభ చూపిన విద్యార్థులకు పుస్తకాలు బహుమతులుగా అందించబడ్డాయి. వీటితోపాటు 10 వ తరగతి పబ్లిక్ పరిక్షలలో ప్రధమ, ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్థులకు మానికొండ శ్రీనివాసరావు వారి కుటుంబ సభ్యులు ముత్తాత,తాతమ్మ పాపయ్య,వీరమ్మ తాత నాయనమ్మ పోతురాజు, సీతమ్మ తండ్రి వెంకటేశ్వర్లు, చెల్లి జ్యోతి ల జ్ఞాపకార్థం నగదు బహుమతులు ఇచ్చారు. తృతీయ స్థానం పొందిన విద్యార్థులకు శ్రీ దగ్గుపాటి శ్రీనివాసరావు సౌజన్యం తో నగదు బహుమతులు ఇచ్చారు.








ఈ కార్యక్రమంలో శ్రీ నవ్య భారత విద్యాలయాల పాలక వర్గ అధ్యక్షులు శ్రీ చిట్టినేని సురేష్ బాబు, నిర్వాహక కార్యదర్శి శ్రీ గోరంట్ల శేషగిరిరావు, పాలకవర్గ సభ్యులు శ్రీ గోరంట్ల రాఘవేంద్రరావు,అతిధులుగా శ్రీ మానికొండ శ్రీనివాస రావు, స్వాతి డైరీ కారంచేడు అధినేత శ్రీ దగ్గుపాటి  శ్రీనివాసరావు పాల్గొన్నారు. 
ఈ కార్యక్రమాన్ని శ్రీ నవ్య భారత ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కన్నెగంటి కుమారస్వామి గారు , శ్రీ నవ్య భారత గోరంట్ల బుచ్చిపాపయ్య ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ శ్రీనివాసరావు గారు నిర్వహించారు. బహుమతులు పొందిన విద్యార్థులకు కొమల ట్రస్ట్ చైర్మన్ కొడాలి శ్రీనివాస్ గారు అభినందలు తెలియజేసారు, కొమల ట్రస్ట్ తరుపున ట్రస్ట్ సభ్యులు శ్రీ గోరంట్ల రాఘవేంద్రరావు ఈ కార్యక్రమానికి భాద్యత తీసుకున్నారు 


Comments

Popular posts from this blog

ధన్యజీవి కీర్తి శేషులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి

కీ. శే. కొడాలి మల్లిఖార్జునరావు గారి చతుర్ధ వర్ధంతి

కొడాలి వారి వంశ వృక్షం